Friday, March 4, 2016

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దరఖాస్తు ఆన్లైన్లోలో చేసుకోవడం ఇలా

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్. నిరుపేదల ఆత్మగౌరవం కోసం అంటూ సీఎం కేసీఆర్ ఆలోచనల్లో మొలకెత్తిన ఈ పథకం.. ఇప్పుడు జనానికి అత్యంత దగ్గరైంది. అయితే ఈ పథకం నిమైన లబ్ధిదారులకే చేరితేనే ప్రభుత్వ అసలు లక్ష్యం నెరవేరుతుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆఫీసులు చుట్టూ తిరగకుండా మీ సేవలో ఆన్ లైన అప్లికేషన్ ఎలా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలి… అనే అనుమానాలను తీరుస్తుంది వీసిక్స్…

ఇళ్లు లేని నిరుపేదల కోసం, వారి ఆత్మగౌరవం కోసం ప్రవేశపెట్టిన పథకం అయినందున నిజమైన లబ్ధిదారులకే లబ్ది చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
* అర్హత ఉన్నవారు స్థానిక మీసేవా కేంద్రాల్లో సంప్రదించాలి.
* అక్కడ దరఖాస్తు ఫారాన్ని తీసుకుని, పూర్తి వివరాలతో నింపాలి.
* ఫారానికి పాస్‌పోర్టుసైజ్ ఫొటోతోపాటు, ఆధార్, ఫుడ్‌సెక్యూరిటీ కార్డు జిరాక్సులను జతపర్చాలి.
* కుటుంబ సభ్యుల ఆధార్‌కార్డు ఉంటే మంచింది.
* ప్రస్తుత అడ్రస్‌లో ప్లాట్‌నెంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉండేలా చూసుకోవాలి.
* మండలం, గ్రామం, కాలనీ, డివిజన్, ల్యాండ్‌మార్క్, లొకాలిటీ వంటి అంశాలను తప్పనిసరిగా పేర్కొనాలి.
* దరఖాస్తు దారుడి ఆధార్ నెంబర్, వయస్సు, సంవత్సర ఆదాయం, సెల్ నెంబర్లను కూడా తెలియపర్చాలి.
* గతంలో ప్రభుత్వ ఆసరా పెన్షన్, ఇళ్లు పొందినవారైతే స్పష్టంగా వివరాలను తెలపాలి.
* మొబైల్ నెంబర్, ఉంటే ఈమేయిల్ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది.
ఇలా అన్ని వివరాలతో కూడిన ఫారాన్ని మీ సేవా కేంద్రాల్లో ఇస్తే, సదరు నిర్వాహకులు పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, ఫొటోలను అప్‌లోడ్ చేసి, మిగతా వివరాలను నింపుతారు. అనంతరం చెల్లిపు రశీదును అందించినప్పుడు రూ.25ను చెల్లించాల్సి ఉంటుంది. దళారుల చేతుల్లో మోసపోకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

  1 comment:

Popular Posts